యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డికి బి.యన్. సాహితీ పురస్కార-2018 ప్రదానం
వాస్తుశిల్పి డా.బి.యన్.రెడ్డిగారు జీవించి వున్నప్పుడు 1994 లో బి.యన్.సాహితీపురస్కారం ప్రారంభించబడి,21 మంది లబ్ద ప్రతిష్టులైన కవులకు ప్రతి సంవత్సరం యీ పురస్కారం ప్రదానం చేయబడింది.మూడు వసంతాల విరామానంతరం బి.యన్.భౌతికంగా మనకు దూరమైన తర్వాత యీ సంవత్సరం బి.యన్.రెడ్డి జయంతి సందర్భంగా .. యువ కళా వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డికి బి.యన్. సాహితీ పురస్కార-2018 ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యరంగానికి సారిపల్లి కొండల రావు అధ్యక్షత వహించగా, వై.కె. నాగేశ్వర రావు స్వాగతం వచనాలతో వ్యాఖ్యానం చేసారు. ముఖ్య అతిధిగా ప్రభుత్వ సలహాదారు రమణ చారి ఐ. ఏ.ఎస్. పాల్గొన్నారు.
సభకుముందు వాగ్దేవి సంగీత విద్యాలయం విద్యార్ధినులచే భక్తి సంగీతం కమనీయంగా జరిగింది.డా.జంధ్యాలసబ్బలక్ష్మి రచించిన ప్రశంసాపత్రం భాగీశాస్త్రి చదివారు.అక్కినేని శ్రీధర్ సమన్వయం,వై.కె.నాగేశ్వరరావు స్వాగతం వచనాలతో సభ చక్కగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి మధుసూదన రావు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, అనుమాండ్ల భూమయ్య, డా.మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.