ఆక్లాండ్ న్యూజీలాండ్ లో 2017 – ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు
ఆక్లాండ్ లో ఫికిలింగ్ కన్వెన్షన్ సెంటర్ లో తెలుగు భాషాభిమానులు తెలుగు మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. న్యూజిలాండ్ లోని తెలుగు భాషాభిమానులు మహాసభలకు భారీగా తరలివెళ్లాలని మహాసభల ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలు అరుణ జ్యోతి ముద్దం, నరేంద్ర రెడ్డి పటోళ్ల, విజయభాస్కర్ రెడ్డి కొసన, నర్సింగ రావు ఇనగం, అభిలాష రావు యాచమనేని, కిరణ్ కుమార్ పోకల, మన బడి న్యూజిలాండ్ సహ వ్యవస్థాపకుడు మురళీధర్ రావు, నిర్వాహకురాలు సునీత విజయ్, కళ్యాణ్ రావు కాసుగంటి, సంగీత భారతి మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ మల్లెల గోవర్ధన్, తెలుగు సంగం అధ్యక్షుడు ధర్మేందర్ అల్లే మరియు న్యూజిలాండ్ లోని ఇతర సంగాల సభ్యులు, భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.