అట్టహాసంగా ప్రగతి భవన్లో బతుకమ్మ వేడుకలు
ప్రగతి భవన్ లో శనివారం మహిళలు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడారు. గవర్నర్ శ్రీ ఇఎస్ఎల్ నరసింహన్ సతీమణి విమల, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సతీమణి శోభ, ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, హరీష్రావు సతీమణి శ్రీనిత, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, మహిళాభివృద్ధి సంస్థ చైర్మన్ గుండు సుధారాణి తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
Courtesy:FB/Telangana CMO