శిల్పారామంలో అలరించిన ఫ్లూట్ రిసైటల్ మరియు భరతనాట్య ప్రదర్శనలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంఫిథియేటర్ ల ఫ్లూట్ రిసైటల్ మరియు భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి.
మంతెన ఉమాశంకర్ బృందం వేణుగానం ఆద్యంతం అలరించింది. మోహన వర్ణం, వాతాపి గణపతిం, సరస్వతి నమస్తుతే, సామజవరాగమన, రఘువంశ సుధాంబుధి, దండము పెట్టెదర, కోదండరామ, తందనాన భళా, నగుమోము గలవాని పాటలను ఉమాశంకర్ వేణునాదంలో అమృతంగా పలికించారు.
ముంబైకి చెందిన భరతనాట్య కళాకారిణి కుమారి దివ్య బాలచంద్రన్ తన ప్రదర్శనలో నటేశకాతం, శ్రీమన్నారాయణ, శ్రీ రామచంద్ర, అలైపతువే కన్నా, మధుర భక్తి పదం, ఇందేందు వచ్చితివిరా క్షేత్రయ్య పదం దిల్లాన అంశాలను ప్రదర్శించారు.