గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలి: ఉప ముఖ్యమంత్రి కడియం
హైదరాబాద్ ఆగష్టు 12(ఎక్స్ ప్రెస్ న్యూస్): స్వాతంత్ర్య పోరాట సమయంలో, తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయాలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషించాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిఅన్నారు. టెక్నాలజీ పెరగడం వల్ల పుస్తకాలకు కాస్త ప్రాధాన్యత తగ్గినా… పుస్తకాలకు వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. వాటికి నెలవైన గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలని సూచించారు. శనివారం రవీంద్రభారతి లో లైబ్రేరియన్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఆర్ రంగరాజన్ 125 వ జయంతి సందర్భంగా లైబ్రేరియన్ డే చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.