ప్రముఖ సినీ నిర్మాత డా. డి. రామానాయుడు జయంతి సందర్బంగా సురేష్ ప్రొడక్షన్స్ వైభవం శీర్షికన అలరించిన “తెలుగు సినిమా స్వర్ణయుగం” సంగీత విభావరి
త్యాగరాయగానసభ: సురేష్ ప్రొడక్షన్స్ వైభవం శీర్షికన “తెలుగు సినిమా స్వర్ణయుగం” పేరిట సంగీత విభావరి కార్యక్రమం శనివారం సాయంత్రం 5 గంటలకు త్యాగరాగానసభ లో రసరమ్యంగా జరిగింది. ప్రముఖ సినీ నిర్మాత డా. డి. రామానాయుడు జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు మాట్లాడుతూ రామానాయుడు తెలుగు సినీ ప్రపంచానికి ఎన్నో మంచి చిత్రాలు అందిచారని అన్నారు.
యువకళావాహిని, శృతి లయ,రసాంజలి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో డా.బి.యస్.రాములు,లయన్ డా.ఏ.విజయ్ కుమార్, యలవర్తి రాజేంద్రప్రసాద్, కళా జనార్దన్ మూర్తి, టి.రామకృష్ణ, శ్రీమతి కె.గీతామూర్తి అతిథులుగా పాల్గొన్నారు.
గాయనీగాయకులు ఆమని, వి.కె.దుర్గ, కె.వెంకటరావు, సుభాష్, పవన్ కుమార్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలలోని పాటలను ఆలపించి అభినందనలు పొందారు.. వీరందరికి కార్యక్రమం జయప్రదం చేశారు.