యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ ప్రారంభించి న MLA ఫైళ్ల శేఖర్ రెడ్డి,MLC ఏలిమినేటి కృష్ణారెడ్డి,రాచకొండ సీపీ మహేష్ భగవత్, ప్రారంభ తరువాత పోలిస్ స్టేషన్ ప్రాఅంగణం లో హరితహారం భాగంగ మొక్కల నాటినరు సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే తాగి డ్రైవ్ చేయవద్దని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం వలన అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అలా చేయడం తప్పని చేయకూడదని సీపీ అన్నారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్ (dpo)లో హరితాహారం చేపట్టి వివిధ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి కలెక్టర్ అనిత రామచంద్రన్, mla తదితరులు పాల్గొన్నారు. అనంతరం వలిగొండ మండలంలో 24 సీసీ టీవీలని ఏర్పాటు చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది తో సమానమని, మూడో కన్ను లాంటిదని.. తప్పు చేసినవారు సీసీ టీవీ నుంచి తప్పించుకోలేరని రాచకొండ సీపీ అన్నారు. ఈ ptz కెమెరా 3 కిలో మీటర్ వరకు ఎం జరిగిన చూసుకోవచ్చు అని, తప్పు చేయడానికి కూడా భయపడలని ఆయన అన్నారు.