తెలుగు భాషకు, సాహిత్యానికి డోకాలేదు – డా. పాలకుర్తి మధుసూదన్ రావు
త్యాగరాయగానసభ: తెలుగు వర్థిల్లుతున్నది, కళాసంస్థలు కవిసమ్మేళనాలు, సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రచయితలు, కవులు పుష్కలంగా ఉన్నారని తెలుగు భాషకు, సాహిత్యానికి డోకాలేదని డా. పాలకుర్తి మధుసూదన్ రావు అన్నారు. శ్రీకిరణ్ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయగానసభలో ౧౨ మంది కవులకు సత్కార కార్యక్రమం నిర్వహింహరు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్, కవయిత్రి హిమజ, పాత్రికేయులు బైసా దేవదాసు, పొత్తూరి జయలక్ష్మి సంస్థ అధ్యక్షులు, కవి లంకా వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.