తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీద్రభారతిలో ఈ నెల 13న కావ్య పరిమళం పాల్కురికి సోమన “బసవ పురాణం”పై డా. అనుమాండ్ల భూమయ్య ప్రసంగ కార్యక్రమం – ఏనుగు నరసింహా రెడ్డి,కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి
అరుదైన తెలుగు కావ్యాలను సాహిత్యకారులకు పునర్విమర్శ చేయించడం ద్వారా తెలుగు సాహిత్య ఔన్నత్యాన్ని మరోసారి చర్చించుకునే అవకాశం కలుగుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి భావిస్తుంది.
ఈ క్రమంలో నెల నెలా ఒక అపురూప కావ్యాన్ని పరిచయం చేయిoచాలని అకాడమి సంకల్పించింది. ఈ పరంపరలో భాగంగా తొలుత పాల్కురికి సోమన “బసవ పురాణం”పై 13.04.2018 సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్ లో డా.అనుమాండ్ల భూమయ్య గారు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి డా. నందిని సిధారెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. సాహిత్య అభిమానులకు స్వాగతం అని తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఏనుగు నరసింహా రెడ్డి తెలిపారు.