తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ ఆక్లాండ్ లో జరిగిన మహా బతుకమ్మ సంబరాలలో మన తెలంగాణ సంప్రదాయంలో అతిథులకు స్వాగత సత్కారాలు, సన్మానాలు ఘనంగా జరిగాయి -24-Sep-17
తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ మహా బతుకమ్మ సంబరాలు ఆక్లాండ్ లో ఘనంగా జరుపుకున్నారు. సుమారు 500 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొన్నారు.
తెలంగాణ కు మాత్రమే ప్రత్యేకమైన ఈ పూల పండగలో, ఇతర రాష్ట్ర ప్రజలు, చైనీస్ మరియు కివీస్ (newzealanders) కూడా పాలు పంచుకున్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలతో ఆడారు. కోలాటం ప్రత్యేక ఆకర్షణగ నిలిచింది. దాదాపు 5 గంటలు విరామం లేకుండా బతుకమ్మ ఆటలు ఉత్సాహముగా ఆడారు.
TJNZ మొదటి బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకేలా జరిగాయి. TJNZ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి తమ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన్దీప్ కౌర్ NZ police department , శ్రీమతి నీలిమ గారు, శాంతి నివాస్ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ జీత్ గారు భారతీయ చారిటబుల్ ట్రస్ట్ పాల్గొన్నారు.
అంతటా పండగ వాతావరణం, ఆనందం, కోలాటం, బతుకమ్మ ఆటలు, పాటలు, చక్కటి భోజనం, ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయులు అంతా పండగే, అంతటా ఆనందమే. బతుకమ్మ పాటలు, అందమైన బతుకమ్మలు, అందమైన సాంప్రదాయ వస్త్రధారణ వంటి ఎన్నో అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు అందమైన చేనేత చీరలు మరెన్నో అందమైన బహుమతులు అందచేశారు.
మన బంగారు బతుకమ్మను మల్లి ఏడాదికి రమ్మని ఆహ్వానిస్తూ మహిళలు సాగనంపారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ జ్యోతి గారు ధన్యవాదాలు తెలిపారు.
TJNZ మన తెలంగాణ సంప్రదాయంలో అతిథులకు స్వాగత సత్కారాలు, సన్మానాలు ఘనంగా జరిపారు. ఈ సంబరాల్లో TJNZ ఆత్మీయులు, శ్రీమతి వర్ష రెడ్డి పట్లోళ్ల, శ్రీ రామ్ యాదవ్ బిజ్జు, శ్రీ రాజవర్ధన్ రెడ్డి, శ్రీమతి శీతల అల్లం, శ్రీ రాఘవేంద్ర కట్టెల, శ్రీమతి ప్రసన్న గుమ్ముడవెల్లి, శ్రీమతి కవిత మన్నెం, శ్రీమతి శ్రీలత అల్లే, శ్రీమతి విజయలక్ష్మి ముమ్మడి, శ్రీమతి శ్వేతా పట్లోళ్ల, శ్రీమతి నిర్మల మోహన్, శ్రీమతి సరితా విక్రమ్, శ్రీమతి సంధ్య జగన్, శ్రీ అయ్యుబ్ ఖాన్, శ్రీ విజయ్ సిరిసిల్ల, శ్రీ సోమేశ్ బండ్ల, తెలుగు అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీ ధర్మేందర్ అల్లే గారు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీ కళ్యాణ్ కాసుగంటి గారు, తెరాస న్యూజీలాండ్ అధ్యక్షులు శ్రీ విజయ్ కోసన గారు తదితరులు పాల్గొన్నారు