హైదరాబాద్: నెక్లెస్రోడ్డులో భాజపా ఆధ్వర్యంలో తిరంగాయాత్ర నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన భాజపా నాయకులు పెద్దఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు, కార్యకర్తలు నెక్లెస్ రోడ్డులో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ తిరంగాయాత్రలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.