వాస్తవిక కథలకు కావ్యగౌరవం కల్పించిన మహాకవి సోమన – తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి
వాస్తవిక కథలకు కావ్యగౌరవం కల్పించిన మహాకవి సోమన అని, బసవడి బోధనలు, సంస్కరణలు అన్ని సోమన రచనలో కనిపిస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి అన్నారు.
అరుదైన తెలుగు కావ్యాలను సాహిత్యకారులకు పునర్విమర్శ చేయించడం ద్వారా తెలుగు సాహిత్య ఔన్నత్యాన్ని మరోసారి చర్చించుకునే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో నెల నెలా ఒక అపురూప కావ్యాన్ని పరిచయం చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమి సంకల్పించింది. ఈ పరంపరలో భాగంగా ఈ రోజు 13.04.2018 సాయంత్రం రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ కావ్య పరిమళం’ శీర్షికన నిర్వహించిన పాల్కురికి సోమన “బసవ పురాణం” పై తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య డా. అనుమాండ్ల భూమయ్య ప్రసంగించారు. బసవపురాణం గొప్ప ద్విపద కావ్యం అంటూ, ప్రజల భాషలో ప్రజల కోసం రచించిన సాహసికుడు పాల్కురి సోమన అని అన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ పాల్కురి సోమన గొప్ప సంస్కరణవాది అంటూ కవుల పేరుతో యుగవిభజన చేసి తెలంగాణ సాహిత్య చరిత్రను రాసుకోవలసిన అవసరం ఉందన్నారు.
సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన సాహిత్యంపై ప్రసంగాలు అవసరమని, తెలంగాణ కవుల రచనలను శ్రద్దగా చదవాలని అన్నారు. ప్రజల భాషలో రాసిన తోలి కావ్యం బసవ పురాణం అని చెప్పారు. వీరశైవాన్ని ప్రబోధించిన కవి సోమన అని అంటూ అయన సాహితి వ్యక్తిత్వాన్నీ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, ప్రసంగ కర్త డా. అనుమాండ్ల భూమయ్య, సాహిత్య అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.