తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ టి.బి.ఎన్. రాధాకృష్ణన్, హైకోర్టు ఆవరణలో తెలంగాణకు కేటాయించిన ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ టి.బి.ఎన్. రాధాకృష్ణన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్ లో గవర్నర్ ఈ.యస్.ఎల్ . నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలంగాణకు కేటాయించిన ఇతర న్యాయమూర్తుల తో హైకోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయించారు.
హైకోర్టు విభజన అనంతరం ప్రధాన న్యాయమూర్తి తో సహ 13 మంది న్యాయమూర్తులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. జస్టిస్ రాఘవేంద్ర చౌహన్ , జస్టిస్ రామసుబ్రమణ్యం , జస్టిస్ వెంకట సంజయ్ కుమార్ , జస్టిస్ రామచంద్ర రావు, జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ కోదండరాం చౌదరి, జస్టిస్ శివశంకర్ రావు, జస్టిస్ షమీమ్ అక్తర్ , జస్టీస్ కేశవరావు, జస్టిస్ అభినంద్ షావలి, జస్టిస్ అమర్ నాధ్ గౌడ్ లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యామూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు అంజనీ కుమార్ , మహేష్ భగవత్ , తేజ్ దీప్ కౌర్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్ రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.