ప్రపంచ తెలుగు మహా సభలు
ఈ నెల 27-30 వరకూ రాష్ట్రస్థాయి సాహిత్య, సాంస్కృతిక పోటీలు
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలలో పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాల, యూనివర్శిటీల విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ఇదివరకే మండల, జిల్లా స్థాయి పోటీలు పూర్తయ్యాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నవంబర్ 27 నుంచి 30 వరకూ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు హైదరాబాద్ తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో జరుగుతాయి.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయిన విద్యార్థుల వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై బహుమతులు అందిస్తారు.