నాట్య ప్రియుల మన్నలను అందుకున్న శివాని అరంగేట్రం
రవీంద్రభారతిలో శనివారం శివాని సరస్వతి కురువాడ అరంగేట్రం ఆకట్టుకుంది. ప్రముఖ నృత్య గురువులు పద్మభూషణ్ రాజా, రాధా రెడ్డి, కైశల్య, యామినిరెడ్డి వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందిన శివాని సరస్వతి కురువాడ శనివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికపై కూచిపూడి నృత్యాంశాలకు తనదైన శైలిలో నర్తించి అరంగేట్రం చేసింది. తోలి ప్రదర్శనలోనే రసజ్ఞులైన నాట్య ప్రియుల మన్నలను అందుకున్న శివాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి ముఖ్య అతిధిగా హాజరై అభినందించారు.