శిల్పారామంలో ఘనంగా ముగిసిన “ఉగాది వసంతోత్సవాలు”
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగ+ఆది = ఉగాది కాలక్రమేణ ఉగాదిగా మారిన శుభ పర్వదినం పురస్కరించుకొని శిల్పారామంలో గత మూడు రోజుల నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ” ఉగాది వసంతోత్సవాలు ” కోయిల రాగాలతో పచ్చని వాతావరణంలో పచ్చిక పైళ్ల నడుమ ఆంఫి థియేటర్ లో ప్రత్యేకంగా ఉగాది కొరకు ఏర్పాటు చేసిన ‘ పంచాంగ శ్రవణం ‘ శ్రీ సాగి కమలాకర శర్మ గారు ఎంతో విధ్వత్తుతో 12 రాసుల గురించి చక్కగా వివరించి చెప్పారు.
” ఉగాది నవవసంతం “లో డా. హిమబిందు కనౌజ్ వారి బృందం ఆరు ఋతువుల వాటి కాలాలు ఉపయోగాలు ప్రకృతి వైపరీత్యాలు నడుమ జీవన విధానం గురించి కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించారు.
అంతర్జాతీయ కథక్ కళాకారులు శ్రీమతి & శ్రీ హరిచేతన గార్లు వారి బృందంతో ‘కథక్ సంబ్రమ్’ పరమేశ్వరుడిని ఓంకారంతో స్తుతిస్తూ, రాధాకృష్ణుల రాసలీల గూర్చి వివరిస్తూ, తరణం తాండవంతో ముగించారు.
శిల్పారామం మరియు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు వారు సంయుక్తంగా పుదుచ్చేరి, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరాకాండ్, పంజాబ్, మణిపూర్, మహారాష్ట్ర జానపద కళాకారులు ఎంతో సంబరంగా నర్తించారు. కళాకారులందరికి శిల్పారామం ప్రత్యేక అధికారి ఘనంగా సత్కరించారు.