ప్రేక్షకులను ఆధ్యాత్మిక పరవశంలోకి తీసుకెళ్లిన ” శ్రీ సద్గురు సాయినాదమ్ ” కూచిపూడి నృత్య ప్రదర్శన
శిల్పారామంలో మహా శివరాత్రి పండుగ పురస్కరించుకొని కుమారి NSL ప్రవీణ గారి నేతృత్వంలో ” శ్రీ సద్గురు సాయినాదమ్ ” కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.
మహా శివరాత్రి సందర్బంగా ప్రదర్శించిన షిరిడి సాయి బాబా జీవిత చరిత్ర ప్రేక్షకులను ఆధ్యాత్మిక పరవశంలోకి తీసుకెళ్లింది. సాయి బాబా బాల్యం, మధ్య వయస్సులో అయన భోదించిన సాయి తత్వాలను, హారతి పాటలు, ఉపదేశాలు, సాయి మహిమలను, షిరిడీ గ్రామం ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లు కళాకారులూ ప్రదర్శించారు. నృత్య దర్శకత్వం కుమారి NSL ప్రవీణ, మరియు కళాకారులు రఘురామ్, న్సల్ తువీణ, దుర్గా, కోటేశ్వర్, అలేఖ్య, వైష్ణవి, ఓం ప్రకాష్, సురేష్, సంహిత, అక్షిత, నిలయ, సుమీద మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.