శిల్పారామం మరియు ప్రమాయాస్ సంయుక్త నిర్వహణలో ఘనంగా ప్రారంభమైన ” కృష్ణమృతం ” మ్యాజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్
శిల్పారామం లోని ఆంఫీ థియేటర్ లో శిల్పారామం మరియు ప్రమాయాస్ సంయుక్త నిర్వహణలో ” కృష్ణమృతం ” మ్యాజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది. శ్రీమతి జయ రామన్, రిటైర్డ్ అడిషనల్ జనరల్ మేనేజర్, ఎస్.బి.ఎహ్ మరియు శ్రీమతి అంబుజం సాయీ, సంగీత విద్వంసురాలు జ్యోతి ప్రజల్వన చేసీ ప్రారంభించారు.
వింగ్ కమాండర్ శ్రీ యజ్ఞారామన్ గారి నేతృత్వంలో శ్రీమతి అంజనా తిరుమలై గారి చే కర్ణాటక గాత్ర కచేరి జరిగింది. స్వాగతం కృష్ణ, గోపాల పాహిమాం, వేణుగాన లోలుని వంటి కీర్తనలను గానం చేసారు.
శ్రీమతి అర్చన మిశ్ర గారి బృందం చే కథక్ నృత్య ప్రదర్శనలో గణేశ వందన, లంబోదర గౌరిసుత, గోపి గోపాలబాల, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.
కళైవాలర్ మణి శ్రీమతి అపర్ణ రమేష్ గారి బృందం భరతనాట్య ప్రదర్శన అద్యంతం అలరించింది. కాళింగ నర్తన థిల్లాన, హరినారాయణ కాతం, పుష్పాంజలి మొదలగు అంశాలను ప్రదర్శించారు.