ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు అన్నమాచర్య కీర్తనలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం సమర్పించు కూచిపూడి నృత్య ప్రదర్శనలో శ్రీమతి ముద్దలా ఉషా గాయత్రి, నృత్య కిన్నెరా వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ప్రదర్శించారు.
శ్రీమతి రమ్యవేణి, శ్రీమతి గౌతమి, కుమారి నీరజ, కుమారి అర్చన శ్రీనివాసు లు ప్రదర్శించారు.
అవధహరించి, నమశ్శివాయతే, చంద్రశేఖరాష్టకం, కులుకగ నడవరో, స్వామినాథ, చక్కని తల్లికి, గంధము పూయరుగ, అలరులు కురియగ, నగుమోము గలవాని, జయ జయ వైష్ణవి దుర్గే అంశాలను కూచిపూడి నృత్యశైలిలో రసరమ్యంగా నర్తించారు. ప్రత్యేకంగా అన్నమాచార్య కీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.