అలరించిన కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా శిల్పారామం ఆంఫీ థియేటర్ లో కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి
కుమారి అంజనా రమేష్ బెంగళూరు భరతనాట్య కళాకారిణి కళీకతం, శివపదం, మధురానగరిలో, రంజనీమాల శైలిలో నర్తించారు.
ముంబై భరతనాట్య కళాకారిణి కుమారి ప్రత్యూష రావు పడవర్ణం మరియు క్షేత్రయ్య పదంపై నర్తించారు.
అమృత ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి సాయి గీత ఆధ్వర్యంలో వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకొంది. జయము జయము, మహాగణపతిం, నమ:శివాయ, పలుకే బంగారం, జతిస్వరం, కొలువైతివా, తారంగం, ఆనందతాండవం, అదిగో అల్లదిగో, నటేషకాతం, రామాయణ శబ్దం మరియు థిల్లాన అంశాలను సాయిగీత, కీర్తి, శృతి మొదలైనవారు నర్తించారు.
కళాకారులందరికి ప్రశంసాపత్రాలను ఆంధిచి ప్రోత్సహించారు.