శిల్పారామంలో ఘనంగా ముగిసిన “ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ ”
శిల్పారామం మరియు సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు సంయుక్తంగా నిర్వహించు “ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ ” ముగింపు ఉత్సవాలలో భాగంగా దాదాపు 120 మంది కళాకారులు పాల్గొని ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ ని విజయవంతం చేసారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజన నృత్యాలు గుస్సాడీ మరియు మాధురి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధింసా, కొమ్ముకొయ్య గిరిజన నృత్యాలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన గిరిజన నృత్యాలు సిద్ధి ఢమాల్, డొల్లుకునిత, కేరళ రాష్ట్రానికి చెందిన తాంబాచికళి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గిరిజన నృత్యం బెట్టకురుంబ మొదలగు గిరిజన నృత్యాలు ఎంతగానో అలరించాయి.
గిరిజన కళాకారులందరిని ఘనంగా సత్కరించారు.