శిల్పారామం: అలరించిన కర్ణాటక గాత్ర కచేరీ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్ లో కర్ణాటక గాత్ర కచేరీ మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
శ్రీమతి విశాలాక్షి గారిచే కర్ణాటక గాత్ర కచేరీ ఆద్యంతం మెప్పించింది.
శ్రీ సాయి నటరాజ నృత్య నికేతన్ శ్రీమతి భారతి గారి శిష్యబృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీశైల శివమయం, పలుకే బంగారమాయె, అదివో అల్లదివో, ముద్దుగారె యశోద, ఓమ్ నమశ్శివాయ, లీలా మానుష, శ్రీ శారదా, కళా శారదా, జై గణనాయక వినాయక అంశాలను ప్రదర్శించారు.