శిల్పారామం: అలరించిన కూచిపూడి, భరతనాట్యం మరియు కథక్ నృత్యప్రదర్శనలు
ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్ లో కూచిపూడి, భరతనాట్యం మరియు కథక్ నృత్యప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
కువైట్ లో నివశిస్తున్న మన హైదరాబాదీ అమ్మాయి కుమారి సముద్రాల దీక్షిత తన కూచిపూడి ప్రదర్శనలతో కట్టి పడేసింది. వినాయక కేతం, సరస్వతీ శబ్దం మరియు కొలువైతివా రంగశాయి అంశాలను ప్రదర్శించింది.
బెంగళూరు భరతనాట్య కళాకారిణి కుమారి బినాక రాధాక్రిష్ణ తన ప్రదర్శనలో సొగసుగ త్యాగరాజ కీర్తన ఇందులో నవరసాల అభినయాన్ని ప్రదర్శించింది. పాలకడల్ అలిమేలై, మండోదరి శపథం అంశాలను ప్రదర్శించింది.
‘నినాద్’ కథక్ సంధ్య – కుమారి అర్చన మిశ్రా గారి శిష్యబృందం కథక్ నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకొంది. గీనతి, చతురంగ్, తరాణ, భన్సురి, నిజాకతె, గుంగురు అంశాలను ప్రదర్శించారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ శ్యామ్ హరి చక్ర గారు అతిథిగా విచ్చేసి కళాకారులందరినీ ఆశీర్వదించారు.