ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామంలో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.
కేరళ సత్యాంజలి అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ శ్రీమతి అనుపమా మోహన్ గారు, జయదేవ అష్టపది మరియు కన్నప్ప చరితం అంశాలను కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించారు. శ్రీ అనీలె వెట్టికాత్తిరి గారు ఉషా పరిణయం, మోహినీ అట్టం, శ్రీమతి మీనాక్షీ ప్రదీప్ గారు రామనన్ రచించిన పదం ని ప్రదర్శించారు. శ్రీ ధరమ్ రాజ్ గారు భరతనాట్య శైలిలో “సుందర గణపతి” వర్ణం ని ప్రదర్శించి మెప్పించారు.
కృషి నృత్య అకాడమీ శ్రీ కాంతరావు గారి ఆధ్వర్యంలో వారి శిష్యబృందం వినాయక కేతం, తరంగం, బ్రహ్మాంజలి, భామా కలాపం, ముద్దుగారె యశోద, శివతాండవం, మాధురీ జానపద నృత్యాలు ప్రదర్శించారు. దాదాపు 50 మంది కళాకారులు పాల్గొన్నారు.