వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్ లో భరత నాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
శ్రీ రాజాదత్త కోల్ కతా భరతనాట్య కళాకారుడు హైదరాబాద్ మొట్టమొదటిసారిగా శిల్పారామంలో ప్రదర్శన ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావించారు. శిల్పారామం కళాకారులకు ఇచ్చే ప్రోత్సాహాన్ని అంతగానో అభినందించారు. పుష్పాంజలి, అలరిపు, ఆనంద నటన ప్రకాశం, పదం, థిల్లాన మరియు తోడయ మంగళం అంశాలను ప్రదర్శించారు.
పంచమవేది నాట్యనిలయం శ్రీమతి కనకదుర్గ గారి ఆధ్వర్యంలో వారి శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చినారు. పుష్పాంజలి, జయము జయము, శివ పంచాక్షరి, జతిస్వరం, పలుకే బంగారమాయె, భామా కలాపం, బాలగోపాల తరంగం, రామాయణ శబ్దం, ఆనంద తాండవం, మహిషాసుర మర్దిని అంశాలను ప్రదర్శించారు.