తరంగ్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహించే “జుగల్బందీ” కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయులు శ్రీ అన్నారావు గారు విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి రెండవ రోజు భరత నాట్యం మరియు కథక్ “జుగల్బందీ” సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కుమారి భావనా గౌరి భరతనాట్య శైలిలో, మరియు కుమారి ప్రియాంక చంద్రశేఖర్ కథక్ నృత్య శైలిలో జయ జయ దుర్గే, కృష్ణవర్ణం, సర్గం, అభంగ బృందావని, సకీరే అష్టపది, తరాణ అంశాలను, ఇద్దరు కలిసి జుగల్బందీలో నర్తించి ప్రేక్షకులను మెప్పించారు
కళాకారులను తరంగ్ తరఫున శ్రీ సూరిగారు సన్మానించారు.