నృత్యకుంజ్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహించు రెండవ రోజు “ గురు ప్రణామ్” నృత్య ఉత్సవం ఎంతో ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ కళాకారిణి శ్రీమతి డా. అనుపమ కైలాష్ మరియు శ్రీ రాఘవరాజ్ భట్ గారు మరియు ఆర్తి శంకర్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మొదటగా శ్రీమతి స్వాతి ఫడ్కీ మరియు కుమారి పూభాలి గారు హిందూస్థానీ గాత్ర కచేరీతో ప్రారంభించారు. మియామలారే, చోటకలాల్, తరాణ, భజన్ మొదలైన పాటలు గానం చేశారు.
కథక్ విద్వాంసులు శ్రీ రాజేంద్రకుమార్ గంగానీ గారు శివ పంచాక్షరీ, తీన్ తాళ్, గద్ భావె, హనుమాన్ భజన్, మరియు జుగల్ బందీ అంశాలను కథక్ నృత్యశైలిలో నర్తించారు.
శ్రీ వరి మంగళంపల్లి మరియు కుమారి నేహా సింగ్ భరతనాట్య శైలిలో పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతిం, థిల్లాన అంశాలను ప్రదర్శించారు. శ్రీమతి దీప నారాయణన్ శశిధరన్ గారు కూచిపూడి శైలిలో అన్నమాచార్య కీర్తన, చంద్రశేఖరమ్ అంశాలను ప్రదర్శించారు. కళాకారులందరినీ శ్రీమతి ఆర్తి శంకర్ గారు సన్మానించారు.