శిల్పారామం: కృష్ణాష్టమి సందర్భంగా శిల్పారామం ఆంపీ థియేటర్ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో అలరించిన కథక్ మరియు కూచిపూడి నృత్య కార్యక్రమాలు – 14-AUG-2017
బెంగళూరు కథక్ నృత్య కళాకారిణి కుమారి యశస్వినీ శివరామన్ తన నృత్య ప్రదర్శనలో గణపతి మూరతే, ఫాలనేత్ర హర పినాకి, శ్రీనందానంద భజన్, మరియు తరానా అంశాలను ప్రదర్శించారు.
నృత్యోదయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ శ్రీమతి ప్రసన్న రాణి గెరీ ఆధ్వర్యంలో, వారి శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చినారు. వినాయక కేతం, క్రిష్ణం కలయ సఖి తరంగం, మండూక శబ్దం, దశావతారం, థిల్లాన, కృష్ణ అష్టకం, కొలువైతివా రంగశాయి, గోవర్ధన గిరిధారి, గోవింద ఖననా, జయ జనార్దన మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.