వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామం ఆంపీ థియేటర్లో భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
కుమారి సారహ సంగీత (స్విట్జర్లాండ్) భరతనాట్య కళాకారిణి తన ప్రదర్శనలో అలరిపు, గణపతికేతం, ఆనందనటన ప్రకాశం, అంతపురగీతే, శివోహం, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.
బెంగళూరు భరతనాట్య కళాకారిణి శ్రీమతి దివ్య ప్రసాద్ గారు తమ ప్రదర్శనలో, శబ్దం, ఎన్పళ్ళికొందిరయ్య, శివస్థుతి అంశాలను ప్రదర్శించారు.
మంజీర అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్, శ్రీమతి రేణుక ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, వారి శిష్యబృందం కూచిపూడి ప్రదర్శనలో, గణపతికేతం, పుష్పాంజలి, మోదమున దరువు, ఇందరికి అభయము ఇచ్చు చెయ్యి, ముద్దుగారె యశోద, కళింగ నర్తన థిల్లాన, కులుకగ నడవరో కొమ్మలార, వడెలెరె వయ్యారులు, కొలువై ఉన్నాడే దేవదేవుడు, జగడపు జనవుల జాతర అంశాలను ప్రదర్శించారు.