శిల్పారామం: “ప్రమయాస్స్” వారి ఆధ్వర్యంలో “గణేశామృతం” మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్
ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామంలో “గణేశామృతం” గా మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ని “ప్రమయాస్స్” వారి ఆధ్వర్యంలో వింగ్ కమాండర్ మింజూర్ ఎం. యజ్ఞరామన్ గారు నిర్వహించారు. శ్రీమతి అనురాధ రెడ్డి, కన్వీనర్, హైదరాబాద్ ఛాప్టర్-ఇంటాక్ అండ్ ఏవియేషన్ హిస్టోరియన్ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
మొదటగా “గణేశామృతం”లో విఘ్నరాజు అయిన గణపతి మీద గీతాలను ఆలపించారు. కుమారి ప్రియదర్శిని, రక్ష, సఫియా, మాస్టర్ విక్రమ్, విద్యాలక్ష్మి, ప్రియాంక, ప్రణవ్, శ్రీవత్స లు పాటలు పాడారు. వీరికి వయొలిన్ పై ధనుంజయ రావ్, మల్లికార్జున్ మృదంగంపై, వింగ్ కమాండర్ మింజూర్ ఎం. యజ్ఞరామన్ గారు ఫ్లూట్ మరియు మోర్సింగ్ పై సహకరించారు.
కుమారి సునీత నాయుడు గారు కూచిపూడి మరియు హరీ మంగళంపల్లి గారు భరతనాట్య ప్రదర్శన ఇచ్చినారు. పుష్పాంజలి, అలరిపు, వినాయక ద్వాదశనామాలు, ఏకదంతాయ, థిల్లాన అంశాలను ప్రదర్శించారు. శ్రీమతి అనురాధ రెడ్డి గారు కళాకారులందరినీ సన్మానించారు.