శిల్పారామంలో అలరించిన బతుకమ్మ సంబరాలు, నృత్యప్రదర్శనలు – నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకూ ” అఖిల భారత చీరల మేళా ” ప్రారంభం
తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన బతుకమ్మ సంబరాలు శిల్పారామంలో నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుంది. శిల్పారామం మహిళా సిబ్బంది రోజూ బతుకమ్మలను పేర్చి ఆడి పసుపు కుంకుమలను ఇచ్చుకొని నిమజ్జనం చేస్తున్నారు. శిల్పారామంకు విచ్చేసిన సందర్శకులు కూడా పాల్గొంటున్నారు.
దేశం నలుమూలల నుండీ విచ్చేసిన చేనేత కళాకారులతో ‘అఖిల భారత చీరల మేళా’ ఈ రోజు నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుంది. బనారస్ చీరలు, మహేశ్వరీ, చందేరీ చీరలు, పటోల, అశ్వాలి మొదలైన చీరలు దాదాపు 40 చేనేత జాతీయ అవార్డు గ్రహీతలు విచ్చేసి స్టాల్స్ పెట్టుకున్నారు. ఈ రోజు నుండి సందర్శకులకు అందుబాటులో ఉంటారు.
ఎస్.జడ్.సి.సి నాగూర్ మరియు సంగీత నాటక అకాడమీ కళాకారులు శ్రీ విశాల్ సకలే, ఎంపి గాంగౌర్ నృత్య శ్రీ శ్రవణ్ చత్తీస్ఘర్ గౌర్ మాడియా, శ్రీమతి దివ్య నేడుంగడి మోహినీ అట్టం, నృత్యప్రదర్శనలు మరియు డా. రక్ష కార్తీక్ భరతనాట్య ప్రదర్శన, శ్రీ చిన్న ఆంజనేయులు లెదర్ పప్పెట్, మరియు శ్రీ సత్తిరాజు గారు తప్పెటగుళ్ళు నృత్యాలను ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారు. సందర్శకులను ఆకట్టుకున్నారు.