ఆకట్టుకున్న కుమారి కిరణ్మయి మడుపు భరతనాట్య ప్రదర్శన, “ సైని” నృత్యాలయ శ్రీ హరి మంగళంపల్లి మరియు శ్రీమతి నేహా సింగ్ ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలు
ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామంలో భరతనాట్య ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
కుమారి కిరణ్మయి మడుపు తన భరతనాట్య ప్రదర్శనలో, “సాధించనే” త్యాగరాజు పంచరత్న కీర్తన, భావయామి, రఘువంశ సుధాంబుధి చంద్ర అంశాలను ప్రదర్శించారు.
“ సైని” నృత్యాలయ శ్రీ హరి మంగళంపల్లి మరియు శ్రీమతి నేహా సింగ్ ఆధ్వర్యంలో, వారి శిష్యబృందం. పుష్పాంజలి, గణేశ కేతం, మల్లారి, శ్రీరామచంద్ర, కోలాటం, కవాడి, కుండలపై నృత్యం, మరియు మంగళం అంశాలను నేహా సిం, చైత్ర, ఇషిత, నందిని, నిత్య, హరి మంగళంపల్లి వారు ప్రదర్శించారు.