వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శిల్పారామంలో భరతనాట్యం మరియు కూచిపూడి నృత్యప్రదర్శనలు ఎంతగానో అలరించాయి
బెంగళూరు భరతనాట్య కళాకారిణి శ్రీమతి రక్షిత రమేష్ గారి ప్రదర్శన ఆకట్టుకుంది. పుష్పాంజలి, శివస్థుతి, భజన్, దేవరనామ అంశాలను ప్రదర్శించారు.
సుమధుర ఆర్ట్స్ అకాడమీ కుమారి శ్రావ్య మానస గారి బృందంచే కూచిపూడి ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. వినాయక స్థుతి, జయము జయము, ఇట్టి ముద్దులాడే బాలుడు, నటేశ కేతం, ముద్దుగారె, కృష్ణ శబ్దం, శంభో శివ శంభో, మండోదరి శబ్దం, తరంగం అంశాలను శ్రావ్య మానస, శ్రీలక్ష్మి, నీహారిక, తన్వి, విహారిక మొదలైనవారు ప్రదర్శించారు.