శిల్పారామంలో మూడవరోజు బతుకమ్మ సందర్భంగా పచ్చని మైదానంలో బతుకమ్మ సంబరాలను సందడితో ఎన్.ఐ.ఎఫ్.టి విద్యార్థినీ విద్యార్థులు దాండియాఆటలతో అలరించారు
శిల్పారామంలో మూడవరోజు బతుకమ్మ సందర్భంగా పచ్చని మైదానంలో బతుకమ్మ సంబరాలను సందడితో మొదలు పెట్టినారు. తర్వాత ఎన్.ఐ.ఎఫ్.టి విద్యార్థినీ విద్యార్థులు దాండియా ఆడిపాడారు.
ఎస్.జడ్.సి.సి తంజావూర్ కళాకారిణి శ్రీమతి విచిత్ర పొల్లికండి భరతనాట్యం మరియు మోహినీ అట్టం నృత్యాంశాలను ప్రదర్శించారు. పుష్పాంజలి, అలరిపు, పదం, కీర్తనయై పదం, నవరసం అంశాలను కౌసల్య, వైతేశ్వరీ, మెర్సీ, సతీష్ కుమార్, మొదలైనవారు ప్రదర్శించారు.
సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ ప్రాయోజితం చేసిన గంగౌర్ నృత్య – శ్రీ విశాల్ సకలే మరియు గౌర్మాడియా-శ్రీ శ్రావణ్ కుమార్ మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్ఘడ్ గిరిజన నృత్యాలను ప్రదర్శించారు.
మహతి కళాసమితి శ్రీమతి శ్రీదేవి శిష్యబృందం కూచిపూడి నృత్యం ప్రదర్శించి మెప్పించారు.