శిల్పారామం ఆంఫీ థియేటర్లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రామలలో భాగంగా ఆకట్టుకొన్న భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు ప్రదర్శనలు
ముందుగా కుమారి మాలిని అగ్రహార్ బెంగళూరు ప్రముఖ భరతనాట్య కళాకారిణి తన నృత్య ప్రదర్శన ప్రారంభించింది. ప్రాణవాకారం, సిద్ధివినాయకం, జతిస్వర, అష్టపది, థిల్లాన అంశాలను ప్రదర్శించారు.
శ్రీ గీతిక కూచిపూడి ఆర్ట్స్ అకాడమి వారి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మహాగణపతిం, శ్రీగణనాయక, కుండపై నృత్యం, థిల్లాన, దశావతారములు, పలుకే బంగారమాయెనా, జతిస్వరం, కృష్ణశబ్దం, తారంగం, శివతాండవం, స్వరరాగధిల్లాన, మహిషాసురవర్ధిని, విన్నపాలు వినవలె మొదలైన అంశాలను సౌమ్య, వైశాలి, తనుశ్రీ, భావిక, చేతనలక్ష్మి, శ్రీలాస్యా, పూజ, వైష్ణవి మొదలైన కళాకారులు ప్రదర్శించారు.
కళాకారులందరికి జ్ఞాపికలతో సత్కరించారు.