శిల్పారామంలో మూడవ రోజు ” తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ” – అధిక సంఖ్యలో పాల్గొన్న సందర్శశకులు – అలరించిన సాంసృకుతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు
శిల్పారామంలో నిర్వహించే ” తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ” మూడవ రోజు సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పచ్చని వాతావరణంలో, విద్యుత్ కాంతులలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి సంతోషం వ్యక్తపరిచారు.
శ్రీమతి ఇందిర ముసునూరి శిష్య బృందంచే కూచిపూడి నృత్యం ఆద్యంతం అలరించింది. గణేశ పంచరత్న కీర్తన, శివతాండవ స్తోత్రం, థిల్లాన, దీపాంజలి, స్వరతరంగిణి, వెంకటాచలనిలయం అంశాలను ప్రదర్శించారు.
సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్, నాగపూర్ సంయుక్త నిర్వహణలో భాగంగా జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి. మహారాష్ట్రకి చెందిన జానపద నృత్యం లావనీ నృత్యాల సునీల్ ధోతేరే బృందం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం డొల్లుకుచిత, నరసింహ మూర్తి బృందం, మహేష్ యాదవ్ బృందం బరెడి – మధ్యప్రదేశ్ రాష్ట్ర జానపద నృత్యం, పండితారామ్ బృందం కర్మ నృత్యం – ఛత్తీస్గడ్ ప్రదర్శించిన కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకొన్నాయి.