ఘనంగా ముగిసిన ఇండియా క్రాఫ్ట్ మేళ 2017 ఉత్సవాలు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన చీఫ్ సెక్రటరీ ఎస్.పి సింగ్ IAS
శిల్పారామం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్ష్ఠాత్మకంగా డిసెంబర్ 15th to 31st వరకు నిర్వహించే అల్ ఇండియా క్రాఫ్ట్ మేళ 2017 ఈరోజు ముగింపు ఉత్సవాలను ఎంతో ఘనంగా చేసారు. ముఖ్య అతిధిగా ఎస్.పి సింగ్ IAS చీఫ్ సెక్రటరీ విచ్చేసి ముగింపు ఉత్సవాలను తిలకించారు.
దాదాపు నిర్విరామంగా 17 రోజులు ఏకధాటిగా ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ అఫ్ టెక్సక్టీలెస్ వారి సౌజన్యం తో నిర్వహించిన అల్ ఇండియా క్రాఫ్ట్ మేళ లో దాదాపుగా చేనేత మరియు హస్తకళాకారులు 550 ఆర్టిసన్స్ వారి ఉత్పత్తులను సందర్శకులకు అందుబాటులో ఉంచారు. వారాంతపు సెలవులలో, పండగ రోజులలో సందర్శకుల రద్దీ అధికంగా ఉండీ ఉత్పత్తులు చాల అమ్ముడుపోయినందుకు స్టాల్ ఓనర్ లు అందరు ఎంతో సంతోషం వెలిబుచ్చారు.
ఈరోజు యంపీ థియేటర్ లో సరస్వతి సొసైటీ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ కెనడా నుండి విచ్చేసిన NRI నృత్య కళాకారులు “వామన ” నృత్య రూపకం ని ప్రదర్శించారు. డా. వేదాంతం వెంకటాచలపతి గారు ఆధ్వర్యం లో ప్రదర్శించడం జరిగింది .ప్రముఖ బెంగళూరు కూచిపూడి కళాకారిణి శ్రీమతి అర్చన పునీష్ గారి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఎంతగానో అలరించింది.
Best artisians :
- R. Jeeva – Innovative Woodan Fret Work
- Vankar Kaya Samat- Shawls- Santh Kabeer Awardee
- Mrs. Usha Sri- Jute
- Sri Dhhani Ram Soni- Brass Metal- National Awardee
Highest Sales
- Smt. Y. Sesha Ratnam – Embroidery – Rs.8,03,000/-
- Sri Niranjan Basak- Jamdani & Kani Sarees- Rs.4,50,000/-
- Omkar Apens Crafts- Jute- Rs.2,94,225/-
4.Romi Hasan – Shawls- Rs.14,50,000/-