కళాకారులకు సారిపల్లికొండలరావు ఫౌండేషన్ లలిత కళా పురస్కారాలు, తెలంగాణ జానపద కళా పురస్కారాలు
రవీంద్రభారతిలో బుధవారం సాంస్కృతిక బంధు సారిపల్లికొండలరావు ఫౌండేషన్ లలిత కళా పురస్కారాలు, , తెలంగాణ జానపద కళా పురస్కారాలను ముఖ్య అతిధి శాసనసభాపతి మధుసూదనాచారి కళాకారులకు ప్రదానం చేశారు. యువకళావాహిని-ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళారంగంలో వివిధ విభాగాల కళాకారులకు పురస్కారాలు అందచేసి ఘనంగా సత్కరించారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా.జమున, డా.పి.మధుసూదనరావు, డా.సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు, శ్రీమతి గీతాంజలి, గుమ్మడి గోపాలకృష్ణ అతిథులుగా విచ్చేశారు.
పదిమంది కళా మూర్తులకు లలిత కళా పురస్కారాలు, పదిమంది తెలంగాణ జానపద కళాకారులకు జానపద కళా పురస్కారాలు ఈ సందర్భంగా పదివేల నూటపదహార్ల నగదుతో ప్రదానం చేశారు.
శ్రీ సారిపల్లి కొండలరావు గారికి 78వ జన్మదిన సత్కారం ఘనంగాజరిగింది.
సభకు ముందు జరిగిన సినీజానపదం సంగీత విభావరి లో గాయనీ గాయకులు శశికళ,ఆమని,డా.వి.వి.రామారావు, చింతలపాటి సురేష్ పాల్గొన్నారు.
కళావాచస్పతి లంక లక్ష్మీనారాయణ సభా కార్యక్రమానికి, లయన్ వై.కె.నాగేశ్వరరావు సంగీత విభావరికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.