టాక్ ఎట్ సినివారం విత్ మల్లేశం సినిమా బృందం, రవీంద్రభారతి
తెలుగు సినిమా చరిత్రలో స్థిరస్థాయిలో నిలిచిపోయే సినిమా మల్లేశం: మామిడి హరికృష్ణ
Contents
టాక్ ఎట్ సినివారం విత్ మల్లేశం సినిమా బృందం, రవీంద్రభారతితెలుగు సినిమా చరిత్రలో స్థిరస్థాయిలో నిలిచిపోయే సినిమా మల్లేశం: మామిడి హరికృష్ణ100 యేండ్ల తెలుగు సినిమా చరిత్రలో గొప్ప సినిమాల్లో ఒకటిగా మల్లేశం నిలుస్తుందని, ఇలాంటి ఒక గొప్ప ప్రయత్నం చేసిన నిర్మాత, దర్శకుడు రాజ్ రాచకొండ అభినందనీయుడని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. శనివారం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సినీవారంలో భాగంగా మల్లేశం చిత్ర యూనిట్ సభ్యులతో ముఖాముఖీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ఇటీవల కాలంలో రొటీన్ సినిమాల నుండి తెలుగు ప్రేక్షకులకు కొత్త రకం సినిమాను మల్లేశం ద్వారా దర్శకుడు రాజ్ పరిచయం చేశాడన్నారు. ఇలాంటి ఒక కథను ఎంచుకోవడమే దర్శకుడు ధైర్యానికి నిదర్శనమని అన్నారు. చేనేత కార్మికుల నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలను ఈ సినిమాలో చూపించారని, సినిమాలో నటీనటులందరు అద్భుతంగా నటించారని అన్నారు. అనంతరం సినిమా యూనిట్ ను మామిడి హరికృష్ణ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నిర్మాత, దర్శకుడు రాజ్ రాచకొండ, నటులు ఆనంద చక్రపాణి, లక్ష్మణ్ ఏలే, జగదీష్, అన్వేష్ మైఖేల్, రచయిత పెద్దింటి అశోక్ కుమార్, సినిమాటోగ్రాఫర్ బాలు శాండిల్యస, ఎడిటర్ రఘు పాల్గొన్నారు.