బ్ర.శ్రీ శాస్త్రుల రఘురామ శర్మ రచించిన చాణక్య, చాణక్య నీతిసూత్రాలు, వేకువ కువకువ గ్రంధాల ఆవిష్కరణ
రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దర్శనం ఆధ్యాత్మిక పత్రిక ఆధ్వర్యంలో బ్ర.శ్రీ శాస్త్రుల రఘురామ శర్మ రచించిన చాణక్య, చాణక్య నీతిసూత్రాలు, వేకువ కువకువ అనే మూడు గ్రంధాలను ఘనంగా ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, నర్సాపూర్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అష్టకాల రామ్మోహన్, దర్శనం వెంకటరమణ, దత్తాత్రేయ శర్మ తదితరులు రచయిత శాస్త్రుల రఘురామ శర్మను అభినందించారు.