ఉప్పల్ ఎం.ఎల్.ఏ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రజాదర్బార్ దిన పత్రిక నూతన సంవత్సర క్యాలండర్ 2018 ఆవిష్కరణ
ఈ రోజు (23 -Dec -17) ఉప్పల్ ఎం.ఎల్.ఏ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రజాదర్బార్ నూతన సంవత్సర క్యాలండర్ 2018 ఆవిష్కరణ. కే.ఎల్. నరసింహా రావు, స్పెషల్ కరెస్పాండంట్, ప్రజాదర్బార్ తెలుగు డైలీ, హైదరాబాద్
పత్రికారంగంలో తనకంటు ఓ గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకొని, వాస్తవాలకు ప్రతిరూపంగా వెల్వడుతున్న తెలుగు దిన పత్రిక ” ప్రజాదర్బార్ ” 2018 క్యాలండర్ ను ఉప్పల్ ఎం.ఎల్.ఏ. ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆవిష్కరించారు.
శనివారం ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ సిబ్బంది పాల్గొనగా ప్రభాకర్ క్యాలండర్ ఆవిష్కరించి, ప్రతినిధులకు అందించారు.
ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ ప్రజాదర్బార్ మూడు దశాబ్దాలుగా పాఠకుల అభిమానాన్ని చూరగొని, నిర్విరామంగా ప్రచురణ చేసుకోవడం హర్షణీయం అన్నారు.
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, పాఠకుల ప్రోత్సాహం, శ్రేయోభిలాషుల మన్ననలతో ముందుకు సాగుతోందన్నారు.
ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ప్రజాదర్బార్ పత్రిక వార్తలకు ఒక గుర్తింపు వుందని, నిజాలను ఎప్పటికప్పుడు వెలికి తీయడమే కాకుండా, పాఠకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మధ్య వారధిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందని అన్నారు.
తాను ఎం.ఎల్.ఏ. అయన తర్వాత కావేరేజీలో కూడా ఎప్పుడు ముందుండి, వార్తలు ప్రజలకు చేరవేస్తోందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాదర్బార్ ఛీఫ్ ఎడిటర్ గొంగులూరి వేణు గోపాల్ శర్మ, ప్రజాదర్బార్ ప్రతినిధులు కె.ఎల్. నరసింహా రావు, రవికాంత్, మదిరాజు సురేష్ కుమార్, శ్రీనివాస్ ప్రసాద్, డి. నవీన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గొంగులూరి శ్రీనివాస్ శర్మ, పర్వేశ్ సింగ్, రాజన్ కుమార్ ఝూ, ఆర్.వి. శంకర్, గోపాల్ గౌడ్, అభిసాయి దత్త ట్రస్ట్ నిర్వాహకురాలు జానకమ్మ, ప్రజాదర్బార్ సిబ్బంది పాల్గొన్నారు.