శిల్పారామంలో ఘనంగా నూతన సంవత్సర-2019 వేడుకలు
శిల్పారామంలో నూతన సంవత్సరం సందర్భంగా సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి సంబరాలు చేసుకున్నారు. పచ్చని పచ్చిక బయళ్ళలో కుటుంబ సమేతంగా సేదతీరారు. చిన్నారులు పెద్దలు బోట్ రైడింగ్ చేశారు. షాపింగ్ లో మహిళలు అధిక సంఖ్యలో కొనుగోలు చేశారు. చేనేత హస్తకళలు ఉత్పత్తులు కొనుగోలు చేశారు. పిల్లలు సాండ్ బీచ్ లో ఉయ్యాలలు, ఇసుకలో ఆడుకున్నారు. ఫుడ్ కోర్ట్స్ వద్ద రద్దీ నెలకొంది.
రోజు సాయంత్రం ప్రముఖ భరతనాట్య కళాకారులు దీపక్, శ్రీమతి ప్రీతికళ బెంగళూరు నుండి విచ్చేసి ప్రదర్శించారు. సత్యనారాయణ మరియు బృందం డోళ్లుకుణిత, లేక్ పాల్ మరియు బృందం ” గుడుంబాజ “, రాజయ్య బృందం ” కొమ్ము కొయ్య ” నృత్యాలు ఎంతగానో అలరించాయి.
గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజి విద్యార్థులు చేసిన yoga విన్యాసాలు సందర్శకులను ఎంతగానో అబ్బురపరిచాయి.