- శాంతియుత సమాజం కోసం బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలు చాలా గొప్పవి, గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ” స్పిరిట్ ఆఫ్ లైఫ్ ” కార్యక్రమంలో ఎంపీ కవిత – 19-Nov-17
గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంపీ కవిత హాజరయ్యారు. కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ.. ప్రకృతిని అమ్మగా భావించి పూజించడం ప్రపంచంలో తెలంగాణకే దక్కిన ఘనత, అది తెలంగాణ ఆడపడుచుల సొంతం అని అన్నారు.
బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసేందుకు బ్రహ్మకుమారీస్తో కలిసి వివిధ దేశాల్లో ఉన్న బ్రహ్మాకుమారీస్ సెంటర్ల ద్వారా బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రచారం చేస్తామని కవిత పేర్కొన్నారు. సహనం, ప్రేమ, ప్రపంచశాంతి అనే సందేశంతో శాంతియుత సమాజం కోసం 80 ఏండ్లుగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలు చాలా గొప్పవని, బ్రహ్మకుమారీస్ సంస్థ విశేషంగా కృషి చేస్తున్నదని ఎంపీ కవిత కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, జస్టిస్ ఈశ్వరయ్య, పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సినీనటి గ్రేసీసింగ్, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మున్నీ దీదీ, కుసుమ్ దీదీ, దయాల్, శీలా బెహన్ తదితరులు హాజరయ్యారు.
https://www.facebook.com/KavithaKalvakuntla/videos/1548948395141274/