నెల రోజులుగా జరుగుతున్న తిరుప్పావై, భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు, ఇతర ప్రముఖులకు ప్రశంసా పత్రాలను అందచేసిన నిర్వాహకులు – విశిష్ట అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత్రి డా. మంగళగిరి ప్రమీలాదేవి
ఈ రోజు తిరుప్పావై 29వ రోజు పాశురము
శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం అట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్
శ్రీమాన్ డింగరి రామాచార్యుల వర్యవేక్షణలో శ్రీమాన్ భాస్కరభట్ల ఆంజనేయశర్మ గారి తిరుప్పావై ఉపన్యాసంలో భాగంగా ఈ రోజు 29వ పాశురము విశేషములు,ప్రాముఖ్యతను చెప్పారు.
ఈ రోజు తిరుప్పావై పాశురము ఉపన్యాసం మరియు భక్తి గానం కార్యక్రమాల అనంతరం, నెల రోజులుగా జరుగుతున్న తిరుప్పావై, భక్తి గాన గోష్ఠి కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు, కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ప్రముఖులకు ప్రశంసా పత్రాలు అందచేసిన నిర్వాహకులు. 50 మందికి పైగా ప్రశంసా పాత్రలను అందచేసి వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా పాల్గొన్న ప్రముఖ రచయిత్రి డా. మంగళగిరి ప్రమీలాదేవి.
ఈ కార్యక్రమంలో శ్రీ సిద్దాల దశరధ, శ్రీ బద్దం శ్రీనివాస్ రెడ్డి , శ్రీమతి లక్ష్మమ్మ, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ గోపాల కృష్ణ , అధ్యక్షులు వికాసతరంగిణి శ్రీమాన్ తోట వంశీకృష్ణ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో భక్తి గోష్ఠి గానం కార్యక్రమాల భాగంగా శ్రీమతి సువర్ణకుమారి మరియు శ్రీమతి లావణ్యా బృందం పాడిన భజన, భక్తి గీతాలు భక్తులను అలరింపచేశాయి.
ఈ రోజు తిరుప్పావై ప్రవచనములు మరియు భక్తి గానం కార్యక్రమాలని జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు, మేనేజింగ్ ఎడిటర్ www 24x7onlinenews.com సమన్వయం చేసారు.
ఈ కార్యక్రమం తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం, జిల్లెలగూడ, రంగారెడ్డి జిల్లా వారి సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు మరియు శ్రీ వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, శ్రీమాన్ డింగరి రంగాచార్యులు గారి పర్యవేక్షణలో ప్రముఖ ధార్మికోపన్యాసకులు, వాక్యత శ్రీ భాస్కరభట్ల ఆంజనేయశర్మ (ఎం.ఏ. జ్యోతిష్యం) గారిచే తిరుప్పావై ప్రవచనములు ఘనంగా జరుగుతున్నాయ.