ఆదివారం కూడా ఆసక్తిగా సాగిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆడివరంల్లోనూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు రెండువేల మందికిపైగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తెలుగు రాస్త్రాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా తెలుగు భాషాభిమానులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిలో ఉన్నారు. నవంబర్ ౩౦వ తేదీలోగా రిజిస్ట్రేషన్ సంఖ్య 5వేలకు చేరే అవకాశం ఉంది.
డిసెంబర్ 15 నుంచి 19 వ తేదీ వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం ముమ్మర ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరికి ప్రచార సామాగ్రిని ఆంధిచినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహా రెడ్డి తెలిపారు.