ఘనంగా రాఘవేంద్ర స్వామి 346 ఆరాధనోస్సవాలు
హైదరాబాద్ ఆగష్టు 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ): మంత్రాలయ రాఘవేంద్ర స్వామి 346 ఆరాధనోస్సవాలు రామంతపూర్ లోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఘనంగా జరిగాయి. ఈ నెల 8,9.10 తేదిలలో పుర్వారాధన,మధ్య,ఉత్తరాధన పూజలు నిర్వహించారు. చివరి రోజైన గురువారం రతోస్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి శాసనసభ ఉపనాయకులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహా మంగళ హారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలు అంధజేశారు.అనంతరం రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ రమేష్ చారి మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి ఆరాధనోస్సవాలకు విచ్చేసి ఉస్సవాలను విజయవంతం చేసినందుకు భక్తులకు అభినందనలు తెలిపారు.