గాంధీ దవాఖానాలో ఐసియూని ప్రారంభించిన గవర్నర్ నర్సింహన్
హైదరాబాద్ ఆగష్టు 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ): వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న మార్పులు ఆరోగ్య తెలంగాణ సాధన లక్ష్యంగా ఉన్నాయని, అది మరో ఒకటి రెండేళ్ళల్లోనే సాధ్యమవుతుందన్నారు తెలంగాణ, ఎపి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్. సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానాలోని ఎమర్జెన్సీ బ్లాక్లో 65 పడకల అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పౌర సమాజ సమాచార యంత్రం, డిజిటల్ రేడియోగ్రఫీ, సిటి స్కాన్, సెంట్రల్ డయాగ్నసిస్ ల్యాబరేటరీని గవర్నర్ గురువారం ప్రారంభించారు. ఒక్కో పరికరం, దాని వినియోగం, దాని విలువ వంటి అనేక అంశాలను గవర్నర్ వైద్యులని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ పర్యాద కృష్టమూర్తి, మేయర్ బొంతు రామ్మోహన్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండి వేణుగోపాల్, చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్రెడ్డి, డిఎంఇ రమేశ్రెడ్డి, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల, సూపరింటెండెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.