EPTRI సంస్థతో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. సమీక్షా సమావేశం
10 ఏప్రిల్, 2018 న తెలంగాణ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం, హైదరాబాదులోని సమావేశ మందిరంలో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. అధ్యక్షతన EPTRI సంస్థతో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా వ్యవసాయ అధికారులతో మరియు కమిషనర్ కార్యాలయంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
రాష్ట్రంలోని వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును EPTRI సంస్థ వారు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు మరియు వనపర్తి జిల్లాలలో చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులతో, సహాయ సంచాలకులతో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్. మాట్లాడుతూ… ప్రతిష్టాత్మాకంగా భారత దేశ ప్రభుత్వం నుండి నిధులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందున ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. ఆ దిశగా జిల్లా వ్యవసాయ అధికారులు, PJTSAU ద్వారా నిర్దేశించబడిన పద్ధతులను రైతులకు అందజేయాలన్నారు.
ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని అదేశించారు. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ మరియు అదనపు వ్యవసాయ సంచాలకులు విజయ కుమార్, ఉప వ్యవసాయ సంచాలకులు మాధవి మరియు తదితరులు పాల్గొన్నరు.