నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, భారత ప్రభుత్వము యొక్క యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, గత 15 రోజుల నుండి అంతర్రాష్ట్ర యువజన పరస్పర వినిమయ కార్యక్రమమును “ఏక్ భారత్-శ్రేష్ట భారత్” కార్యక్రమంలో భాగంగా శిల్పారామంలో తెలంగాణ మరియు హరియాణ సంప్రదాయాలను యువతకు పరిచయం చేయుట కొరకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరియాణ రాష్ట్ర కళాకారులు భాంగరా నృత్యం, హరియాణ్వి జానపద నృత్యాలు దేశభక్తి గీతాలు మరియు తెలంగాణ రాష్ట్ర యువజన కళాకారులు బంజారా, పోతురాజు, గుస్సాడీ, దేశభక్తి, జానపద గీతాలను ప్రదర్శించి మెప్పించారు.
నెహ్రూ యువక కేంద్ర హైదరాబాద్ అధికారి, జిల్లా యూత్ కో ఆర్డినేటర్ శ్రీ ఆర్. వెంకటేశం గారు కార్యక్రమాన్ని నిర్వహించారు.