జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన తిరుప్పావై ప్రవచనములు మరియు భక్తి బృందాలచే భక్తి గోష్ఠి గానం మొదటి రోజు కార్యక్రమాలు 16-Dec-17
తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సహకారంతో,శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం, జిల్లెలగూడ, రంగారెడ్డి జిల్లా వారి సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు మరియు శ్రీ వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, శ్రీమాన్ డింగరి రంగాచార్యులు గారి పర్యవేక్షణలో ప్రముఖ ధార్మికోపన్యాసకులు, వాక్యత శ్రీ భాస్కరభట్ల ఆంజనేయశర్మ (ఎం.ఏ. జ్యోతిష్యం) గారిచే తిరుప్పావై ప్రవచనములు మొదటి రోజు ఘనంగా ప్రారంభం అయ్యాయి.
ప్రవచనము కార్యక్రమం ముందుగా శ్రీమతి సువర్ణకుమారి బృందం మరియు శ్రీమతి లావణ్యా బృందం ఆలపించిన భక్తి గోష్ఠి గానం భక్తులను ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు అధ్యక్షులు వికాసతరంగిణి శ్రీమాన్ తోట వంశీకృష్ణ, ఆలయ అర్చకులు శ్రీమాన్ రాఘవాచార్యులు, శ్రీ గురు రాజ్, శ్రీ సత్యనారాయణ చార్యులు, శ్రీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ తిరుప్పావై ప్రవచనములు మరియు ఇతర భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు ప్రతి రోజు సా|| 6 గంటల నుండి జరుగుతాయి. వచ్చే నెల జనవరి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు గరుగుతాయిని, అందరూ ఆహ్వానితులే అని వద్ది రాజు జనార్ధన రావు తెలిపారు.